ఎల్బీనగర్, ఆగస్టు 3 : బోనాల ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున సహాయ, సహకారాలు అందిస్తున్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 171 దేవాలయాలకు రూ.42 లక్షల నిధులు మంజూరు చేసి చెక్కులను స్థానిక కార్పొరేటర్లతో పాటు దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాల్లో బోనాల ఉత్సవాలకు నిధులు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. గత ఏడాది నిరాడంబరంగా జరిగిన బోనాల ఉత్సవాలు ఈ ఏడాది సంబురంగా నిర్వహించేందుకు ఆలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగ మధుసూదన్రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, మొద్దు లచ్చిరెడ్డి, రంగా నర్సింహాగుప్తా, పవన్కుమార్, కళ్లెం నవజీవన్రెడ్డి, ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, బద్దం ప్రేంమహేశ్వర్రెడ్డి, దరిపల్లి రాజశేఖర్రెడ్డి, చింతల అరుణ, కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయ కమిటీ చైర్పర్సన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్: బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను మంగళవారం మన్సూరాబాద్ డివిజన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా ఆలయ కమిటీల ప్రతినిధులకు స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డితో కలిసి ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు రుద్ర యాదగిరి, యంజాల జగన్, పారంద సాయి, పాతూరి శ్రీధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వనస్థలిపురం: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం బోనాల పండుగకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను ఆలయ కమిటీలకు కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగలను ప్రశాంతంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని, అందుకే ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
హయత్నగర్: ఆషాఢమాసం బోనాల పండుగను పురస్కరించుకుని హయత్నగర్ డివిజన్ పరిధిలోని దేవాలయాల వద్ద ఏర్పాట్లకు ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు. ఎల్బీనగర్ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో హయత్నగర్లోని ఆయా దేవాలయాల ధర్మకర్తలకు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బోనాల పండుగకు పెద్దపీట వేస్తున్నారని, ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయాల ధర్మకర్తలు బండారి భాస్కర్, చెన్నగోని మదన్గౌడ్, పంతునాయక్, ఎర్ర రవీందర్, ఎర్ర హరిబాబు, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
హయత్నగర్: డివిజన్ పరిధిలో జరుగుతున్న బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ను పెంచాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి కోరారు. మంగళవారం డివిజన్లోని వెంకటాద్రినగర్ కాలనీలో పర్యటించి బోనాల సందర్భంగా ఆలయ పరిసరాలను పరిశీలించారు.