ఎల్బీనగర్, ఆగస్టు 25 : చైతన్యపురి ఫణిగిరికాలనీ వెంకటసాయినగర్లోని సాయి సన్నిధి దేవాలయంలో బుధవారం బోధన్ డీఎస్పీ రామారావు దంపతులు సాయిబాబాను దర్శించుకున్నారు. దేవాలయంలో ఆలయ కమిటీ ప్రతినిధులు రామారావు దంపతులకు పూజల అనంతరం శాలువాతో సత్కరించి బాబా ఫొటోను బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ నాయుడుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు.