రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడంతోపాటు ప్రజలను మత ప్రాతిపదికన విడదీస్తున్న బీజేపీ వైఖరికి నిరసనగా 14న హైదరాబాద్లో ‘నీలి కవాతు’ నిర్వహించనున్నట్టు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్లోని సితార హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘బ్లూ షర్ట్స్-నీలి కవాతు’ గోడ పత్రికలను ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతి రోజైన 14న నిజాం కాలేజీ సమీపంలోని బాబూజగ్జీవన్రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం దాకా ‘నీలి కవాతు’ జరుగుతుందని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలనుకునే వారంతా నీలిరంగు అంగీలు ధరించి ర్యాలీలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి, అంబేద్కర్ సంఘాల జేఏసీ నేత రాపోలు రాములు, వివిధ ప్రజాసంఘాల నాయకులు నర్సింగరావు, మొగులయ్య, సాయన్న, జి.వెంకట్, సుజీత్రావణ్, మేడి రమణ, టి.నర్సయ్య, గోపీ, కృష్ణ, ఓయూ జేఏసీ నేత బోరేపల్లి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.