అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న నిర్వహించే ‘బ్లూ షర్ట్స్ – నీలి కవాతు’ను విజయవంతం చేయాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. కవాతుకు సంబంధించిన వాల్పోస్టర్ను శనివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ కవాతును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిజాం కళాశాల సమీపంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ విగ్రహం నుంచి ట్యాంక్బండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వరకు మహా నీలి కవాతును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మేడి రమణ, వడ్డె ఎల్లన్న, గాదె వెంకట్, బోరెళ్లి సురేశ్, దర్శనాల జానీ, చటారి దశరథ్, మంగళపల్లి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.