హైదరాబాద్ : వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నాగారంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపును సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇతరుల ప్రాణాలను రక్షించేందుకు రక్తం దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. తలసేమియా రోగులకు, అత్యవసర, ప్రమాద బాధితులకు రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి డీసీపీ రక్షితతో పాటు పలువురు పోలీసులు పాల్గొన్నారు.