సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): తెలంగా ణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా), సేవా భారతి, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా సేవా భారతి తెలంగాణ ఉపాధ్యక్షులు డాక్టర్ సుమలత మాట్లాడుతూ, కరోనా మహమ్మారి కారణంగా రక్తం కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రధానంగా తలసీమియా రోగులకు రక్తం అవసరం ఉం దని, దీనిని దృష్టిలో పెట్టుకొని పలు సంస్థలతో కలిసి రక్తదాన శిబిరాన్ని గచ్చిబౌలిలోని ఆట్రియం మాల్లో నిర్వహించామని తెలిపారు. రక్తం అవసరం ఉన్న వారికి దాత లు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే వారికి ప్రాణ దానం చేసిన వారవుతారన్నారు. ట్రెడా అధ్యక్షులు ఆర్.చలపతిరావు మాట్లాడుతూ, సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, సొసై టీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్లు సైతం ఈ శిబిరాన్ని నిర్వహించడంతో తమతో కలిసి పని చేశాయని, మున్ముందు మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని చలపతిరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రెడా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు విజయ సాయి మేక, కోశాధికారి కె.శ్రీధర్రెడ్డి, ఐఏసీసీ సభ్యులు పీవీరావు పాల్గొన్నారు.