కంటోన్మెంట్, జూన్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న అన్ని జిల్లా కేంద్రాల్లో కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నగేశ్ ముదిరాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రసూల్పురాలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సంఘం కమ్యూనిటీ హాల్లో సంఘం సేవా సమితి తొలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పిట్ల నగేశ్ముదిరాజ్ మాట్లాడుతూ త్వరలోనే జేబీఎస్ వద్ద తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి 11 ఫీట్ల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఏర్పాటు చేయనున్న రాష్ట్ర వ్యాప్త రక్తదాన శిబిరాలను ఆయా జిల్లాల్లోని సేవా సమితి సభ్యులు నిర్వహించనున్నారని, రసూల్పురాలో ప్రారంభమయ్యే రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయన్న ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నేతలు యాదగిరి, ఆంజనేయులు, వేణుగోపాల్, భాస్కర్, శ్యామ్, గౌరీ శంకర్, సత్యనారాయణ, పిట్ల కృష్ణ, కనకయ్య, రాజేందర్, శ్రీను, బాల్రాజ్, నవీన్ పాల్గొన్నారు.