ఎల్బీనగర్ : సీఎం రిలీఫ్ఫండ్తో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. లింగోజిగూడ డివిజన్ విజయపురి కాలనీకి చెందిన భూపతిరావుకు సీఎంఆర్ఎఫ్ నిధుల కింద రూ. 60 వేలు చెక్కును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నా రు. పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలు పొందేందుకు సీఎం సహాయ నిధి ఉపకరిస్తుందన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు తిలక్రావు, మధుసాగర్, అనిల్, వెంటక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.