హిమాయత్నగర్,సెప్టెంబర్5 : దేశంలో ఎక్కడలేని విధంగా దళితుల సమాజిక పు రోఅభివృద్ధికోసం దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు భార తరత్న అవార్డు ఇవ్వాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమను ల్లాఖాన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరు వాత గ్రేటర్లో ఏలాంటి ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారని తెలిపారు.
త్వరల్లో రవీంద్రభారతిలో నిర్వహించే ఆటో డ్రైవర్ల సమావేశంలో భారత శాంతి రత్న అవార్డును సీఎం కేసీఆర్కు అందజేసి ఘనంగా సత్క రిస్తామని వెల్లడించారు. ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న న్యాయ పరమైన సమ స్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో ఆటో జేఏసీ నాయకులు షేక్ అహ్మద్, మహ్మద్ అజీమొద్ధీన్,మహ్మద్ లతీఫ్,ఎంఎ సలీం, మిర్జా రఫతుల్లాబేగ్, సలీం, మహ్మద్ అస్లం, అరుణ్, సయ్యద్ ఖాదర్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.