చార్మినార్, ఆగస్ట్ 10: బాలీవుడ్ సినీ హీరో గోవిందా మంగళవారం పాత నగరంలోని చారిత్రక చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు శశికళ మర్యాదలతో గోవిందా కుటుంబ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పూజారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలను గోవిందా కుటుంబ సభ్యులకు అందించారు. ఆలయ ట్రస్టీ శశికళ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించి, జ్ఞాపికలను అందించారు.