ఫిల్మ్నగర్ సమీపంలో గొర్రె పొట్టేళ్ల పందెం నిర్వహిస్తున్న 11 వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారాహి ల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇ లా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడలోని ఇమాంగూ డ ప్రాంతానికి చెందిన మెహరాజ్ ఖాన్(33) అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్.. బోయగూడకు చెందిన మహ్మ ద్ నుస్రత్, తలాబ్కట్టకు చెందిన అక్రమ్ ఖురేషీతో కలిసి పొట్టేళ్ల పందాలు పెట్టాలనుకున్నాడు. వారివద్ద పెంచుకుంటున్న వీరా, మాలిక్ అనే పేర్లు గల పొట్టేళ్లను ఫిల్మ్నగర్ సమీపంలోని హకీంబాబా దర్గాకు అనుకుని ఉన్న ఖాళీ స్థలంలో శుక్రవారం మధ్యాహ్నం పలువురు పందెం రాయుళ్లను పిలిపించి పొట్టేళ్ల పందాలు ప్రారంభించారు. అరుపులు కేకలతో అక్కడ సం దడి చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. గమనించిన ప్రధాన నిర్వాహకుడు మెహరాజ్ ఖాన్ అక్కడినుంచి పరారవ్వగా.. అక్కడున్న 11మంది పందెం రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశా రు. వారివద్దనుంచి రూ.60వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరా, మాలిక్ అనే పొట్టేళ్లను అంబర్పేటలోని పశుసంవర్థకశాఖ సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు.