భువనగిరి టౌన్, ఏప్రిల్11 : వ్యాక్సిన్ సురక్షితమని, అపోహలు వీడి 45 ఏండ్లు పైబడిన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. పట్టణంలోని హౌ జింగ్బోర్డు కాలనీలో ఆదివారం నిర్వహించిన వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించి మాట్లాడారు. కొవిడ్ వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కులు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు ప్రమోద్కుమార్, నర్సింహ్మ, డాక్టర్ లీలావతి, స్థానికులు అమానత్, బాలేశ్వర్ తదితరులున్నారు.
వ్యాక్సినేషన్ సెంటర్ ఆకస్మిక తనిఖీ
బీబీనగర్, ఏప్రిల్11: మండల కేంద్రంలోని ఆర్అండ్బీ బంగ్లాలో కొనసాగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆదివారం అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏండ్లు పైబడిన వారందరూ టీకా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుధాకర్గౌడ్, ఎంపీడీవో శ్రీవాణి, పీహెచ్సీ వైద్యాధికారులు పాల్గొన్నారు
అపోహలు వీడాలి
చౌటుప్పల్ రూరల్, ఏప్రిల్11: 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని , వ్యాక్సిన్పై అపోహలు పెట్టుకోవద్దని మండల వైద్యాధికారి శివప్రసాద్రెడ్డి అన్నారు. గత ఐదు రోజులు గా మండలకేంద్రంలోని పీహెచ్సీ ఆధ్వర్యంలో స్థానిక సీహెచ్సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో) సెంటర్లో టీకాల పంపిణీ జరు గుతున్నదన్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న మున్సిపల్ సిబ్బంది
ఆలేరుటౌన్, ఏప్రిల్11: ఆలేరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కొవిడ్ టీకా తీసుకున్నారు.
237మందికి కొవిడ్ టీకా
తుర్కపల్లి, ఏప్రిల్11 : 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సుశీలారవీందర్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలో మొత్తం 237మందికి వైద్య సిబ్బంది కొవిడ్ టీకాలు వేశారు. అందులో పీహెచ్సీలో 91 మందికి ధర్మారంలో 146 మందికి టీకాలు వేసినట్లు వైద్యాధికారి చంద్రారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, ఏంపీవో శ్రీమాలిని, కార్యదర్శులు ఉన్నారు.
84 మందికి..
మోటకొండూర్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 84మందికి కొవిడ్ టీకా వేసినట్లు మండల వైద్యాధికారి రాజేందర్నాయక్ తెలిపారు.కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు శ్రీలత, ఎట్టమ్మ, ప్రవీణ్కుమార్, దేవావర, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఉన్నారు.
కొవిడ్ టీకా తీసుకున్న ప్రజాప్రతినిధులు
ఆత్మకూరు(ఎం), ఏప్రిల్11: కొవిడ్ కట్టడికి ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏండ్లకు పైబడిన వారికి టీకాలు ఇస్తుండ టంతో ఆదివారం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో పాటు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి టీకాలు తీసుకు న్నారు. ఎంపీపీ తండమంగమ్మ, జడ్పీటీసీ నరేందర్గుప్తాతో పాటు వివిధ శాఖల అధికారులు, తిమ్మాపురం సర్పంచ్ రాంరెడ్డి కొవిడ్ టీకా తీసుకున్నారు.
కార్మికులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
భువనగిరి టౌన్, ఏప్రిల్ 11 : మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు కొవిడ్ టీకా తీసుకోవాలని భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు అన్నారు. ఆదివారం ఉదయం మున్సిపల్ కార్మికులతో ఆయన మాట్లాడారు. కొవిడ్ రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యం లో కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఆయన వెంట మున్సిపల్ అధికారులున్నారు. అదేవిధంగాభువనగిరి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్ ఆదివారం ప్రభుత్వ ఏరియా దవాఖానలో కొవిడ్ టీకా తీసుకున్నారు.
రామన్నపేటలో
రామన్నపేట, ఏప్రిల్11: కొవిడ్ కట్టడికి ప్రతిఒక్కరూ టీకా తీసు కోవాలని ఆదివారం మండలంలోని కక్కిరేణి గ్రామానికి చెందిన బెస్ట్ సేవా సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఆయన వెంట ఆశ కార్య కర్తలు కవిత, సూర్యకళ, జయప్రకాశ్, కృష్ణ, చలపతిరెడ్డి, ప్రభావతి, ప్రసాద్ తదితరులు ఉన్నారు.
మాస్కులు అందజేత
భువనగిరి అర్బన్, ఏప్రిల్ 11: కొవిడ్ కట్టడికి ప్రతి ఒక్కరూ మా స్కులు ధరించాలని టైగర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సురేశ్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని ఏరియా దవాఖానలోని డాక్టర్ లక్మి, పావనీలకు పీపీఈ కిట్లు, పట్టణ పోలీసులకు మాస్కులను అందజేశారు. కార్యక్రమంలో సురేశ్, శ్రీనివాస్, రాజేశ్ పాల్గొన్నారు.
నేడు వ్యాక్సినేషన్ క్యాంపు
అడ్డగూడూరు,ఏప్రిల్ 11: మండలంలోని కంచనపల్లి , రేపాక, అజీంపేట గ్రామాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు మండలవైద్యాధికారి నరేశ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఈ అవకాశాన్ని 45 ఏండ్లు దాటిన వారు సద్వినియోగం చేసుకోవాల న్నారు. అదేవిధంగా ఆదివారం 76 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
గొల్లకుర్మల ఆర్థిక బలోపేతానికి కృషి
సురక్షిత నీరు అందించడమే ధ్యేయం