సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : వరల్డ్ ఫొటో గ్రఫి డే సందర్భంగా తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్ట్ అసోసియేషన్ గ్రేటర్ హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెస్ట్ న్యూస్ కాంపిటీషన్ విజేతలను గురువారం నిర్వాహకులు ప్రకటించారు. మొదటి బహుమతి సతీశ్కుమార్ (ఈనాడు), ద్వితీయ బహుమతి అలీం ఉద్దీన్ (పీటీఐ) హైదరాబాద్, తృతీయ బహుమతి యాదాద్రికి చెందిన రాజు (ఆంధ్రజ్యోతి) ఎంపికయ్యారు. ఏడు కన్సోలేషన్ బహుమతులకు సురేందర్ (డీసీ) హైదరాబాద్, శివకుమార్ ఫ్రీలాన్సర్, నరేశ్ (వెలుగు) హైదరాబాద్, జి.శ్రీనివాస్ (నమస్తే తెలంగాణ) హైదరాబాద్, నాగేశ్వరరావు (ఆంధ్రజ్యోతి) హైదరాబాద్, శ్యామ్ (హన్స్ఇండియా) వరంగల్, బి.గోపి (నమస్తే తెలంగాణ-మహబూబ్నగర్)ఎంపికయ్యారు.
న్యాయనిర్ణేతలుగా ఈనా డు మాజీ ఫొటో ఎడిటర్ కేశవులు, ది హిందూ మాజీ చీఫ్ సతీశ్ వ్యవహరించారు. ఈనెల 6న రవీంద్రభారతి మినీ హాల్లో ఉదయం 10 గంటలకు బహుమతుల ప్రదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రేటర్ అధ్యక్షుడు ఆనంద్ ధర్మాన, వరింగ్ ప్రెసిడెంట్ అనిల్కుమార్, వైస్ ప్రెసిడెంట్ సురేశ్ కుమార్, జనరల్సెక్రటరీ వీరగోని రజనీకాంత్ గౌడ్, ట్రెజరర్ శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దీపక్ దేశ్పాండే, సతీశ్, మల్లికార్జున్, ప్రభుదాస్, సురేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరహరి, ట్రెజరర్ అనిల్ పాల్గొన్నారు.