సిటీ క్రిమినల్ కోర్ట్, నాంపల్లి, జూన్ 27 (నమస్తే తెలంగాణ): బాగ్లింగంపల్లి సాయిబాబా గుడి వద్ద భిక్షాటన చేస్తున్న వృద్ధురాలు బాలవ్వ(80)ను మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాధాకృష్ణ ఆదేశాల మేరకు ప్రతినిధులు అనిల్కుమార్, శ్రీనివాస్, రమేశ్ బాబు చేరదీశారు. ఆమె ఆరోగ్య స్థితిగతులను, కుటుంబం వివరాలను తెలుసుకున్నారు. భిక్షాటన చేయకూడదని నచ్చజెప్పి.. కుటుంబసభ్యులకు అప్పగించారు. వారితో మాట్లాడి వృద్ధురాలిని అనాథలా వదిలి పెట్టకుండా చూసుకోవాలని సూచనలిచ్చారు. వృద్ధురాలికి ఎటువంటి సహాయం కావాలన్నా లీగల్ సర్వీసెస్ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చారు.