హిమాయత్నగర్, ఏప్రిల్13: యోగాతో ఆత్మైస్థెర్యం, ఆత్మవిశ్వా సం పెంపొందుతుందని సినీ నటుడు సుమన్, బేగంపేట ప్రకృతి చికిత్సాలయం ఇన్చార్జి డాక్టర్ మాలతీ అన్నారు. చేతన యోగా, స్వాస్థ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ వైద్యరత్న జి.చంద్రకాంత్ రచించిన శాస్త్రీయ ప్రాణాయామం అనే గ్రంథావిష్కరణ సభ మంగళవారం రాత్రి హిమాయత్నగర్లోని కేశవ్ మెమోరియల్ హైస్కూల్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం యోగా చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరిచేరకుండా మనల్ని కాపాడుతుందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు యోగా ఎంతో దోహదపడుతుందని, అన్ని మెళుకువలు, లాభాలను గూర్చి చంద్రకాంత్ గ్రంథ రూపంలో తేవడం అభినందనీయమన్నారు. పాఠ్యపుస్తకాల్లో యోగా సిలబస్ను చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగా టీచర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు పి.రవికిశోర్, యోగాచార్యులు, ధరణిప్రగడ ప్రకాశ్రావు, ప్రతినిధులు డాక్టర్ జె.నాగేశ్వరరావు, ఎస్.రవికుమార్, జి.సురేంద్రనాథ్ పాల్గొన్నారు.