మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 22 : రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. శనివారం జిల్లాకేంద్రంలోని సుభాష్నగర్లో ఫీవర్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులతో కలెక్టర్ మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు కొవిడ్ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఫీవర్ సర్వేను ము మ్మరం చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,21,775 ఇండ్లను సర్వే చేసినట్లు తెలిపారు. సర్వేలో కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న 3,934మందిని గుర్తించి హోంఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతిఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికైన కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. కరోనా బాధితులకు హోంఐసొలేషన్ కిట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. బాధితులు సమీపంలోని పీహెచ్సీ లేదా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్రూం నెంబర్ 08542-241165ను సంప్రదిస్తే వైద్యులు ఇంటికొచ్చి వైద్యం అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో కృష్ణ, వైద్యాధికారులు రఫీ, ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించాలి
జడ్చర్లటౌన్, జనవరి 22 : ప్రతిఒక్కరూ కొవి డ్ నిబంధనలు పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ దోరేపల్లి లక్ష్మి, కమిషనర్ సునీత కోరారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కౌన్సిలర్లతో కలిసి ఫీవర్ సర్వేను పరిశీలించారు. వార్డుల్లో జ లుబు, దగ్గు, ఒంటినొప్పులు, ఇతరాత్ర వ్యాధి ల క్షణాలు ఉన్నవారిని గుర్తించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మెడికల్ కిట్లను అందజేశారు. 25వ వార్డు జాఖానగర్ కాలనీలో ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ టీచర్ నర్మద, ఆశ కార్యకర్త సరోజ, ఆర్పీ అరుణ, వైష్ణవి ఇంటింటికె ళ్లి సర్వే నిర్వహించడంతోపాటు వ్యాక్సిన్ వేశారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల, జనవరి 22 : మండలంలోని పోచమ్మగడ్డతండాలో ఫీవర్ సర్వేను జెడ్పీ సీఈవో జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీవర్ సర్వేను పకడ్బందీగా నిర్వహించి ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. కాగా, మండలవ్యాప్తంగా శనివారం 3,668 ఇండ్లను సర్వే చేసినట్లు గంగాపూర్ పీహెచ్సీ డాక్టర్ రాహుల్ తెలిపారు. అలాగే 56మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 11మందికి పాజిటివ్గా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. అ దేవిధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగింది. మాచారంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి బూస్టర్ డోస్ వేయించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగదీశ్, సర్పంచులు రవీందర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, విజయలక్ష్మి, సుకన్య, బాలసుందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం, రాజశేఖర్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జనవరి 22 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యసిబ్బంది ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఈవోపీఆర్డీ వెంకట్రెడ్డి, ఏపీఎం సుదర్శన్, మిషన్ భగీరథ ఏఈ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జనవరి 22 : మండలంలోని రామన్నపల్లితండా, అంకిళ్ల తదితర గ్రామాల్లో జ్వర సర్వేను వైద్యాధికారి నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో రెండు రోజులుగా 8,200 ఇండ్లను సర్వే చేసినట్లు తెలిపారు. అలాగే జ్వరం, జలుబు, దగ్గు, ఒంటినొప్పులతో బాధపడుతున్న 171మందికి హోంఐసొలేషన్ కిట్లు అందజేసినట్లు వివరించారు. మం డలవ్యాప్తంగా 46.97శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి గండీడ్ మండలంలో..
గండీడ్/మహ్మదాబాద్, జనవరి 22 : ఉమ్మడి గండీడ్ మండలవ్యాప్తంగా జ్వర సర్వేను ముమ్మరంగా నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఎవరికైన దగ్గు, జ్వరం, జలుబులాంటి లక్షణాలు కనిపిస్తే మెడికల్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రూపేందర్రెడ్డి, తాసిల్దార్లు జ్యోతి, ఆంజనేయులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, జనవరి 22 : మండలకేంద్రంలో ఫీవర్ సర్వేను తాసిల్దార్ శ్రీనివాసులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జ్వరంతో బాధపడుతున్న వారు కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. అలాగే తిమ్మారెడ్డిపల్లి, పెద్దరేవల్లి గ్రామాల్లో మం డల ప్రత్యేకాధికారి శ్యాంసుందర్ సర్వేను పరిశీలించారు. కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శి లోక్నాథ్, అంగన్వాడీ టీచర్లు కమల, జరీనాబేగం, సునీత, ఆశ కార్యకర్తలు అలియా, రాజ్యలక్ష్మి, ఏఎన్ఎం శోభారాణి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 22 : మండలకేంద్రంతోపా టు బోయిన్పల్లి, వాడ్యాల్, కొత్తూర్, మల్లాపూర్, రాణిపేట తదితర గ్రామాల్లో జ్వర సర్వే ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకుమార్ మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించడంతోపా టు భౌతికదూరం పాటించాలని సూచించారు. జ్వర సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారిని గు ర్తించి హోంఐసొలేషన్ కిట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది దేవయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.