బోడుప్పల్, సెప్టెంబర్ 5: ప్రజలు ఆధ్మాత్మికతకు సమయం కేటాయించాలని, మానసిక ప్రశాంతతకు దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ నగరంలోని పెంటారెడ్డి కాలనీలో కొలువైన మాతా నిమిషాంభికాదేవి ఆలయంలో వేదబ్రాహ్మణుల సమక్షంలో నిర్వహించిన లక్షగాజుల అలంకరణ కత్రువులో రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. వారికి ఆలయ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి, జంట కార్పొరేషన్ల అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, దర్గ దయాకర్రెడ్డి, నాయకులు చక్రపాణిగౌడ్, కార్పొరేటర్ సుమన్నాయక్, ఆలయ చైర్మన్ వినోద్ కుమార్, నకాశ్ సంఘం రాష్ట్ర నాయకులు కొరిచర్ల శ్రీనివాస్ అశోక్కుమార్, రమేశ్, రాధాకృష్ణ, శ్రీనివాస్, నర్సింగ్ రావు, ముత్యాలు, సాయిబాబా, శ్రీకాంత్, సతీశ్ పాల్గొన్నారు.