అమీర్పేట్, మే 10 : బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ ఉప ప్రధానార్చకుడు సౌమిత్రి యోగానందాచార్యులు క్యాన్సర్ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. బల్కంపేటలో నివాసముండే యోగానందకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్యాన్సర్ సోకడంతో దాదాపు రెండు నెలలుగా ఆసుపత్రిలో ఉంటూ చికిత్స పొందుతూ మృతి చెందారన్న వార్తతో దేవాలయంలోని సహ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది దుఖఃసాగరంలో మునిగారు. సౌమ్యుడిగా పేరున్న యోగానందాచార్యులు మృతితో బల్కంపేట పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.