హైదరాబాద్ : బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర వర్షంలోనూ కొనసాగుతోంది. చాంద్రాయణగుట్ట నుంచి ఛత్రినాక మీదుగా ఈ శోభాయాత్ర, భక్తుల కోలహలం మధ్య కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి శోభాయాత్ర చార్మినార్ను దాటింది. మరికొద్ది గంటల్లో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ట్యాంక్బండ్కు చేరుకోనుంది. శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా శోభాయాత్ర కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది రూ. 18 లక్షల 90 వేలకు నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కలిసి లడ్డూను దక్కించుకున్నారు. 2019లో రూ. 17.6 లక్షలకు కొలను రాంరెడ్డి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయిన సంగతి తెలిసిందే.