బాలానగర్, జూన్ 5 : బాలానగర్ చౌరస్తా.. వందలాది పరిశ్రమలకు వెళ్లే మార్గం..ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించే కూడలి.. నిత్యం రద్దీగా ఉంటుంది..అక్కడ సిగ్నల్ దాటాలంటే ప్రయాస. అత్యవసర సమయంలో వెళ్లాలంటే ఇ బ్బందులు చెప్పజాలనివి. సమైక్య రాష్ట్రంలో ఈ చౌరస్తా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. అనేక ప్రమాదాలు జరిగినా కిమ్మనలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ)లో భాగంగా ఇక్కడి చౌరస్తాలో నిర్మిస్తున్న ైప్లెఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే బాలానగర్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పడినట్లే. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యను పరిష్కరించాలని భావించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బాలానగర్ చౌరస్తాలో ైప్లెఓవర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్లను ఒప్పించారు. 2017 ఆగస్టు 21న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ైప్లెఓవర్ పనులకు శంకుస్థాపన చేశా రు. రెండేండ్లలో పనులు పూర్తి చేయాల్సి ఉండగా, భూసేకరణ విషయంలో కొంద రు స్థల యజమానులు కోర్టును ఆశ్రయించడంతో జాప్యం జరిగింది. నెలాఖరులో పు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తె చ్చేందుకు హెచ్ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
బాలానగర్ ప్రధాన రహదారికి గతంలో ముంబయి జాతీయ రహదారిగా గుర్తింపు ఉండేది. జాతీయ రహదారి కావడం, మరో వైపు బాలానగర్, ఫతేనగర్ ప్రాంతాలు పారిశ్రామికవాడలుగా గుర్తింపు పొందడం వల్ల ఇక్కడ నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. పటాన్చెరువు టు సికింద్రాబాద్, జీడిమెట్ల టు సికింద్రాబాద్, చార్మినార్ టు జీడిమెట్ల ప్రాంతాలకు వెళ్లేందుకు బాలానగర్ కూడలి కేంద్ర బిందువు. నగరంలోని పలు పారిశ్రామికవాడల్లో బాలానగర్ పారిశ్రామికవాడకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక్కడ గుండుసూది నుంచి రాకెట్ల తయారీకి సైతం విడిభాగాలు తయారు చేస్తూ తన స్థానాన్ని కాపాడుకుంటుంది. బాలానగర్ ప్రధాన రహదారికి ఒకవైపు ఫతేనగర్ డివిజన్ ఉండగా, మరోవైపు బాలానగర్ డివిజన్ ఉంది. ఈ రెండు డివిజన్ల కలయికతో ైప్లెఓవర్ నిర్మాణం చేపట్టారు.
బాలానగర్, ఫతేనగర్ ప్రాంతాల ప్రజలు నన్ను రెండుసార్లు ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. వారికి కృతజ్ఞతగా ఫ్లైఓవర్ పనులు చేపట్టాం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సానుకూల దృక్పథంతోనే దశాబ్దాల నాటి ట్రాఫిక్ సమస్య పరిష్కారమ వుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్లచే నెలాఖరుకల్లా ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే
బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. దశాబ్దాల నాటి సమస్యకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం దొరకడం హర్షనీయం. ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు నీరాజనం పలుకుతారు. గత పాలకులు పట్టించుకోకపోయినా, తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. – కుర్మయ్యగారి నవీన్కుమార్, ఎమ్మెల్సీ
ఫ్లైఓవర్ పనులు నెలాఖరులోపు అం దుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. రెయిలింగ్, పెయింటింగ్, ర్యాంపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. బీటీ వేయాల్సి ఉంది. వాతావరణం అనుకూలిస్తే త్వరగా పనులు పూర్తవుతాయి. – యూసుఫ్ హుస్సేన్, ఎస్ఈ