అమీర్పేట్, జూలై 6: బల్కంపేట రేణుకా ఎల్ల మ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని ఈ నెల 13వ తేదీన అంతా కలిసి విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యా దవ్ అన్నారు. ఆలయ ఆవరణలో కల్యాణోత్సవ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి మంగళవారం సమీక్షించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు రా నున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఇబ్బందు లు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీ సు సిబ్బందిని, ఇతర అధికారులను అప్రమత్తతతో ఉండాలన్నారు. ఎలాంటి భేషజాలకు పో కుండా అందరూ కలిసి వేడుకను విజయవం తం చేయాలన్నారు.
వేడుకల తొలిరోజును పురస్కరించుకుని 12వ తేదీన జరిగే ఎదుర్కోలు కార్యక్ర మం మొదలు 13న కల్యాణం, 14వ తేదీన రథోత్సవంతో వేడుకలు ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రూ.10 లక్షల నిధులను కేటాయిస్తున్నట్టు తెలిపారు. కా ర్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషు కుమారిలతో పాటు దేవాదాయ శాఖ డీసీ రామకృష్ణ, సాంస్కృతిక విభాగం డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, జలమండలి సీజీఎం ఎం.ప్రభు, దేవాలయ ఈవో ఎస్.అ న్నపూర్ణ, ఆలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా అమీర్పేట్కు చెంది న మనిగుల్ల అమర్నాథ్ అనూష దంపతులు అ మ్మవారికి తులాభారాన్ని సమర్పించుకోగా, మంత్రి తలసాని ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఓ భక్తుడు బెల్లంతో తూచి ఆలయానికి ఆ బెల్లాన్ని సమర్పించారు.