జడ్చర్ల్లటౌన్, ఏప్రిల్19 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జడ్చర్ల మున్సిపల్ వార్డులకు పోటీ చేస్తున్న అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల సెంటర్లో అభ్యర్థుల సమక్షంలో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసేందుకు మొత్తం 241 నామినేషన్ సెట్లు వచ్చాయి. వీటిలో రెండు నామినేషన్లు తిరస్కరించినట్లు ఇన్చార్జి కమిషనర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 17వ వార్డులో అనూష అనే అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్లో డిక్లరేషన్ ఫారంపై సంతకం లేకపోవడంతో తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 18వ వార్డులో మొఖిద్ అనే అభ్యర్థి నామినేషన్ ఫారంపై అభ్యర్థి సంతకం లేనందున తిరస్కరించినట్లు తెలిపారు. రెండు నామినేషన్లు మినహా మిగ తా 239 నామినేషన్లు సరిగా ఉన్నట్లు తెలిపారు.
అచ్చంపేట మున్సిపాలిటీలో..
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 19: అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను సోమవారం పరిశీలించారు. మొత్తం 149 సెట్లు వేయగా ఒక్కటి కూడా తిరస్కరించబడలేదని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. దాఖలైన నామినేషన్లలో నేడు, రేపు ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్రీహరి రాజు తెలిపారు. 22న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నట్లు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి