హైదరాబాద్: హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేపీహెచ్బీకి చెందిన రుత్విక్ బీటెక్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాక్లాగ్స్ ఉండటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.