రవీంద్రభారతి, సెప్టెంబర్ 1 : అవార్డులు సమాజంలో గుర్తింపునిస్తాయని మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య అన్నారు. మదర్థెరిసా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ, మధర్ పౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వివిధ సేవా రంగాలలో ప్రజలకు సేవలందించిన ప్రముఖలకు మదర్థెరిస్సా సేవరత్నా పురస్కారాలను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానవహక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి. చంద్రయ్య, వైఎస్ఆర్సిపి తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, సరస్వతి అవధాని దైవజ్ఞశర్మ విచ్చేశారు. అనంతరం జస్టిస్ జి. చంద్రయ్య మాట్లాడుతూ..సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
సమాజంలో సేవ చేసేవారిని గుర్తించి అవార్డులు ప్రధానం చేయడం వల్ల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు చేస్తారని ఆయన అన్నారు. అనంతరం వివిధ రంగాలలో పనిచేసిన ప్రముఖులకు మథర్థెరిసా సేవరత్నా పురస్కారాలు ఆయన ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మథర్పౌండేషన్ పౌండర్ ఎ.మల్లికార్జున్రావు, డాక్టర్ డికె రెడ్డి ,కె. శ్రీనివాస్చారి తదితరులు పాల్గొన్నారు.