చార్మినార్, సెప్టెంబర్ 6 : పాతనగర వ్యాప్తంగా వరద ముప్పును తప్పించడానికి ప్రణాళికా బద్ధంగా వరదనీటి కాలువల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నామని జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ తెలిపారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు జోనల్ పరిధిలోని వివిధ సర్కిళ్ల పరిధిలో వరద ఉధృతి వల్ల అనేక కాలనీలు, బస్తీల వాసులు ఇబ్బందులకు గురయ్యారని వివరించారు.
మరో మారు అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఎప్పటికప్పుడు వరదనీరు సాఫీగా నాలాలల్లోకి వెళ్లే విధంగా సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.