కొండాపూర్, ఆగస్టు 11 : ఆడుకుంటూ వెళ్లి.. ఆటోమెటిక్ షటర్లో ఇరుక్కుపోయి ఓ బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్, దేవి దంపతులు వారి కుమారులు భానుప్రకాశ్, రాజేశ్(11)లతో కలిసి అంజయ్యనగర్లోని కేఎన్ఆర్ స్కేర్ భవనంలో నివసిస్తున్నారు. అర్జున్ అదే భవనానికి వాచ్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున రాజేశ్ ఆడుకుంటూ వెళ్లి.. భవనం రెండో అంతస్తులో ఆటోమెటిక్ షటర్ మీట నొక్కి..దానిపై పొరపాటున చేయి వేయడంతో లాక్కెళ్లింది. కొడుకు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పైకి వెళ్లి చూడగా, రాజేశ్ షటర్లో ఇరుక్కుపోయి వేలాడుతూ కనిపించాడు. వెంటనే దింపి చూడగా, అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించిన పోలీసులు.. అర్జున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.