బంజారాహిల్స్,సెప్టెంబర్ 1: ఇంటిముందు పార్క్ చేసిన బైక్ మాయమైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫిలింనగర్లోని సాయిబాబా ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న వంగాల నారాయణాచార్యులు జూబ్లీహిల్స్ రోడ్ నెం 36లో ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
గత నెల 30న రాత్రి డ్యూటీనుంచి వచ్చి తన కేటీఎమ్ డ్యూక్ బైక్( టీఎస్09ఎఫ్జే8323)ను ఇంటిముందు పార్క్ చేశాడు. మరుసటిరోజు ఉదయం 7గంటల ప్రాంతంలో బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. ఈ మేరకు అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.