పెద్దవూర, ఏప్రిల్ 23: వ్యవసాయ కూలీల కొరతను తీర్చేందుకు అధునాతన యంత్రాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇటీవల నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి వేరుశనగ కాయను వేరుచేసే యంత్రం వచ్చింది. ఈ యంత్రం ఎకరం వేరుశనగ పంటను గంటలో కట్టె, కాయను వేరుచేస్తుంది. ఇందుకు రూ.1,400 తీసుకుంటున్నారు. ఎకరంన్నర పంటను తీయడానికి 40 మంది కూలీలు అవసరం కాగా, వారికి రూ.6 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఈ యంత్రంతో పని చాలా సులువైందని, ఖర్చు కూడా తక్కువేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.