హైదరాబాద్ : తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శనివారం ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరాయి. ఉపరిత ఆవర్తనం వల్ల మూడ్రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణం కాస్త చల్లడడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆవర్తనం బలహీనపడటంతో మళ్లీ పొడి వాతావరణం ఏర్పడింది. శనివారం పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.3 డిగ్రీల నుంచి 25.8 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి.
విదర్భ నుంచి మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 2, 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా.. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాల్లో నాలుగు చోట్ల చిరు జల్లులు కురిశాయి.
వాట్సాప్ను అప్డేట్ చేసుకోండి
రైల్వే ప్రాంగణాల్లో మాస్క్ తప్పనిసరి