సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): అక్రమ పద్ధతిలో విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. ఆకాష్కుమార్ మాలీ, వికాస్ మాలీల స్వస్థలం రాజస్థాన్. నాలుగేండ్ల క్రితం జీవనోపాధి కోసం హైదరాబాద్కు వచ్చారు. కొన్నాళ్లు వివిధ రకాలైన వ్యాపారాలు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో హోల్సేల్గా విదేశీ సిగరెట్లు అక్రమ పద్ధతిలో విక్రయించే వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. చైనా, మలేషియా, సౌత్ కొరియా దేశాల నుంచి అక్రమ మార్గంలో ఢిల్లీకి తీసుకొచ్చి.. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. వాటిని గోడౌన్లలో దాచి పెట్టి..నగరంలోని పాన్డబ్బాలు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఈ విదేశీ సిగరెట్లను తీసుకొచ్చి మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలోని సీతారాంపేట్లో దాచి ఉంచారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం మంగళవారం ఆ గోడౌన్పై దాడి చేశారు. అందులో పారీస్, ఈస్, బ్లాక్, మాండ్, హెచ్ 10 పేర్లతో ఉన్న రూ. 20 లక్షల విలువైన సిగరెట్ల్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఆకాష్కుమార్ మాలీని అరెస్ట్ చేయగా, మరో నిందితుడు వికాస్ మాలీ పరారీలో ఉన్నాడు. కేసు తదుపరి విచారణను మంగళ్హాట్ పోలీసులకు అప్పగించారు.