వెంగళరావునగర్ : హష్ ఆయిల్ మాదక ద్రవ్యాన్ని విక్రయిస్తున్న ఏడుగురు సభ్యులుగల ముఠాను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.93వేల విలువ చేసే 62 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..ఎర్రగడ్డ, మోడల్కాలనీలోని ఆదర్శ్ మోటర్స్ షోరూం సమీపంలో హష్ ఆయిల్ను విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో మంగళవారం పశ్చిమ మండలం డీసీపీ ప్రత్యేక పార్టీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు.
హష్ ఆయిల్ కలిగి ఉన్న ఎం.రాహుల్(21) ఎం.సతీష్ కుమార్ (25), ఎం.శివ (21), డి.ప్రవీణ్ (28) లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక్కొక్కటీ 5 గ్రాముల చొప్పున ఉన్న 22 హష్ ఆయిల్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను విచారించగా శివాజీనగర్కు చెందిన నాగరాజు (26), పాండురంగరావునగర్కు చెందిన రతన్ (28)ల వద్ద తాము హష్ ఆయిల్ కొన్నామని తెలపడంతో వారిని అరెస్టు చేసి మరో 40 సీసాల హష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బోరబండ బబ్బుగూడకు చెందిన కరీం ఆలియాస్ ఎం.డి ఫయూం వద్ద మొత్తం 100 సీసాల హష్ ఆయిల్ ఒక్కొక్కటీ రూ.1500లకు కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. ఇందులో 38 సీసాల హష్ ఆయిల్ను రూ.2 వేల చొప్పున విక్రయించారు.
కరీంను ఇటీవలే మారణాయుధాలు కలిగి ఉన్న కేసులో సనత్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.