మియాపూర్/కొండాపూర్ , ఏప్రిల్ 30 : కొవిడ్ రెండో దశ వ్యాప్తి వేగంగా కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని , కొవిడ్ నిబంధలను తూచా తప్పకుండా పాటించి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వ విప్, అరెకపూడి గాంధీ అన్నారు. కరోనా కట్డడిలో భాగంగా వివేకానందనగర్ డివిజన్లోని రామకృష్ణ వీధి, వివేకానందనగర్ కాలనీల్లో జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో హైపో క్లోరైట్ ద్రావణాన్ని కార్పొరేటర్ మాధవరం రోజాదేవితో కలిసి విప్ అరెకపూడి గాంధీ పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ కొవిడ్ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. మాస్కులను వాడటం, భౌతిక దూరం పాటించటం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవటం వంటి నిబంధలను పాటించాలన్నారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వాక్సినేషన్ను వేయించనున్నదని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం అధిక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నరేశ్, పార్టీ నేతలు సంజీవరెడ్డి,సురేందర్రెడ్డి, రామచంద్రరావు, కార్తీక్రావు,సాలయ్య, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
వైరస్ కట్టడి చర్యలలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని కృషినగర్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుక్రవారం పిచికారీ చేయించారు. కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ పారిశుద్ధ్య చర్యలను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని, ఎప్పటి కప్పుడు చెత్తను తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ గణేశ్,ఎస్ఆర్పీ కనకరాజు, సిబ్బంది పాల్గొన్నారు.