కొండాపూర్/మియాపూర్/శేరిలింగంపల్లి, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బుధవారం చందానగర్, కొండాపూర్ డివిజన్లలో ఘనంగా నిర్వహించారు. ఎంతో మంది ఉద్యమకారుల త్యాగాలతో సాధించిన రాష్ట్రం టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నదని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులా రఘునాథ్రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, మిరియాల రాఘవరావు, జనార్దన్రెడ్డి, మల్లేశం, గురుచరణ్, రవీందర్రెడ్డి, వెంకటేశం, లక్ష్మీనారాయణ గౌడ్, కొండల్రెడ్డి, ఎల్లయ్య, కృష్ణదాస్ పాల్గొన్నారు.
కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ పీ. మురళీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న కరోనాను నియంత్రించడంలో పోలీసుల పాత్ర ముఖ్యమైనదని, రాబోవు కాలంలో మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ దేవి దాస్ రాథోడ్, సహాయ కమాండెంట్లు వీ .నర్సింహస్వామి, డీ. సత్యనారాయణ, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్, చందానగర్ సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్ నందగిరి సుధాంశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్లు తమ తమ డివిజన్లలో అవతరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకలలో శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ తేజావత్ వెంకన్ననాయక్, జంట సర్కిళ్ల అధికారులు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఆవిర్భావ వేడుకలకు వెస్ట్జోన్ కమిషనర్ నాగళ్ల రవికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. శేరిలింగంపల్లి సర్కిల్ ఉపకమిషనర్ వెంకన్నతో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మెనేజ్మెంట్(నిథిమ్)లో డైరక్టర్ చిన్నంరెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు. నిథిమ్ ఉపాధ్యాయులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.