మియాపూర్, మే 17: వర్షాకాలంలో నాలా పరిసర ప్రాంతాల్లో ముంపు సమస్య పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ధరణీనగర్, సాయినగర్ నాలాల ఔట్ లెట్లను కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారం కురిసిన వర్షంతో నీరు నిల్వకుండా అన్ని ఔట్ లెట్లను తక్షణమే శుభ్రం చేయటం వల్ల ముంపు సమస్యకు తాత్కాలిక ఉపశమనం కల్పించగలిగామన్నారు. సాయినగర్ నాలాపై రూ. 96 లక్షల అంచనా వ్యయంతో కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్ దశలో ఉన్నదన్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాలనీల్లోకి నీరు చేరకుండా ముందస్తు చర్యలతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు గణేశ్, శ్రీనివాస్యాదవ్, సమ్మారెడ్డి, కాశీనాథ్, పోశెట్టి, వాసు పాల్గొన్నారు.
హైదర్నగర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ మెట్రో సమీపంలోని లింక్ రోడ్డులో రూ.2.25 కోట్లతో నిర్మిస్తున్న సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, అధికారులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ సోమవారం పరిశీలించారు. ప్రశాంత్నగర్, గౌతమీ నగర్ కాలనీల్లో పర్యటించి డ్రైనేజీ, రహదారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కాలనీల్లో నెలకొన్న డ్రైనేజీ, రహదారి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిజాంపేట రోడ్డులో హోలిస్టిక్ దవాఖాన సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నారంటూ కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు సదరు నిర్మాణాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఈ గోవర్ధన్, పార్టీ నేతలు శ్రీనివాస్, పోతుల రాజేందర్, కాశీనాథ్ అధికారులు, కాలనీ వాసులు ప్రభాకర్రెడ్డి, భూపాల్రెడ్డి,సుధాకర్రెడ్డి, సుబ్బారావు, జానకిరామ్, రాంప్రసాద్,మధుసూదన్, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.