జయశంకర్ భూపాలపల్లి : జిల్లా కేంద్రంలోని బస్టాండ్స మీపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండలానికి చెందిన తాపీ మేస్త్రీ వెంకటేష్ అనుమానద స్థితిలో మృతి చెందాడు. భూపాల పల్లి ఎస్ఐ నరేష్ తెలిపిన కథనం ప్రకారం..ఆరు రోజుల క్రితం ప్రకాశం జిల్లా నుంచి వెంకటేశ్ భూపాలపల్లిలోని సుభాష్ కాలనీలో నివసిస్తున్న తన దూరపు బంధువుల వద్దకు వచ్చాడు.
కాగా, శుక్రవారం వెంకటేష్ తన ఇంటికి వెళ్లాలని తన బంధువులను కోరాడు. అతడిని సాయంత్రం 6 గంటల సమయంలో భూపాలపల్లి బస్టాండ్ కు తీసుకుని తీసుకెళ్లారు. అయితే తెల్లవారేసరికి బస్టాండ్ ప్రాంతంలో చనిపోయి ఉన్నాడని బంధువులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కొత్తూరును కొత్తగా మారుస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు