హయత్నగర్ : సీఎం కేసీఆర్ వైన్స్ దుకాణాలల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూ శ్రీసాయి కాలనీ గౌడ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైన్స్లలో గౌడ్లకు 15శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నేలపట్ల యాదగిరి గౌడ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి మాట్లాడుతూ వైన్స్ షాపుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వాటాలు ప్రకటించడం హర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ బోడ భిక్షపతి, అయిత గాని యోగిశ్వర్గౌడ్, లింగయ్య గౌడ్, రాజేశ్వరి, సంధ్యారాణి, సావిత్రమ్మ, పద్మ, లావణ్య, నేలపట్ల జ్యోతి, కవిత, రాజేశ్వరి, నేలపట్ల సాయితేజ గౌడ్, ప్రణయ్, సాయిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.