వెంగళరావునగర్, సెప్టెంబర్ 5 : బల్కంపేటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..బల్కంపేట దేవాలయం ఎదురుగా ఉన్న అమరావతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ వద్ద ఫుట్ పాత్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వయస్సు 35 నుంచి 40 సంవత్సరాలు ఉండవచ్చునని ఇతని వివరాల తెలిసిన వారు ఎస్.ఆర్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.