మెహిదీపట్నం: వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లి ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మెహిదీపట్నం పీవీ ఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 42 సమీపంలో వేగంగా దూసుకు వచ్చిన ఎరుపు రంగు కారు(ఎపి09సిఆర్ 5933) అదుపు తప్పి డివైడర్ పై కి దూసుకు పోయింది. ఈ క్రమంలో డివైడర్ సమీపంలో ఉన్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని గట్టిగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాడపడిన వ్యక్తిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు గురువారం చనిపోయాడు. సంబంధీకులు 9490616554 నెంబర్లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.