మారేడ్పల్లి, ఆగస్టు : చికిత్స పోందుతూ గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దానపూర్ ఎక్స్ప్రెస్ రైల్లో జూలై 30వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా..రైల్వే సిబ్బంది వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ..ఈ నెల 9వ తేదీన రాత్రి మృతి చెందాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చూరీకి తరలించారు. మృతుడి ఒంటి పై తెలుపు రంగు చొక్కా, లుంగి ధరించి ఉన్నాడు. మృతుడి వయసు సూమారు 75 సంవత్సరాలు ఉంటాయని వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.