సిటీ సివిల్ కోర్టు, నాంపల్లి, మే 10(నమస్తే తెలంగాణ): కొవిడ్ బారిన పడ్డ న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులకు చికిత్స నిమిత్తం వారి ఇంటి నుంచి ఆస్పత్రికి తరలించేందుకు స్వరాజ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అవినాష్ మాలవ్య అంబులెన్స్లను అందజేశారు. ఈ అంబులెన్స్లను జంట నగరాలలోని న్యాయవాదుల కోసం అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు కొండారెడ్డి తెలిపారు. నాంపల్లి కోర్టులో అంబులెన్స్ సేవలను బార్ అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాల్, కోశాధికారి ఆనంద్ గౌడ్లతో పాటు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాజిరెడ్డి, న్యాయవాదులు అమర్ గుప్తా, హనీఫ్ ఖాన్, ఇబ్రహీం, కిరణ్ కుమార్, తిరుపతి వర్మ తదితరులు పాల్గొన్నారు.