ఘట్కేసర్ రూరల్,మే 3: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి అన్నారు. మండల పరిధి ప్రతాపసింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. రైతును రాజు చేయాలన్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతుల కోసం 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.
రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరను చెల్లిస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించి ఏ గ్రేడ్ రకం ధాన్యానికి రూ. 1,888,బీ గ్రేడ్ రకం ధాన్యానికి రూ.1,868 ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ నాటి ప్రభుత్వాల ఏలుబడిలో రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే వారని కానీ నేడు రైతులు ఆర్థికంగా ఎదుగుతున్నారన్నారు. కార్యక్రమంలో మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, సర్పంచ్లు శివశంకర్, వెంకట్రెడ్డి, ఎంపీటీసీ వెంకట్రాంరెడ్డి, వ్యవసాయాధికారి ఎంఏ.బాసిత్, జగదీశ్, నాయకులు, రైతులుపాల్గొన్నారు.