గోల్నాక డివిజన్లోని కామ్గార్నగర్ బస్తీలో నెలకొన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కామ్గార్నగర్ బస్తీలో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించి స్థానికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు డివిజన్లలో వేధిస్తున్న నీటి కాలుష్య సమస్యను త్వరలో పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కామ్గార్నగర్ కమ్యూనిటీహాల్లో స్థానికులు శుభకార్యాలు చేసుకునేందుకు కమ్యూనిటీహాల్ను మరింతగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గోల్నాక అధ్యక్షుడు భరత్రాజ్ముదిరాజ్, పట్లూరి సతీశ్, వినోద్, సాయి తదితరులు పాల్గొన్నారు.