బంజారాహిల్స్,ఆగస్టు 27: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ (బీఏ, బీకామ్,బీఎస్సీ)తో పాటు పీజీ (బీఎల్ఐఎస్సీ, డిప్లోమా) కోర్సుల్లో చేరడానికి గడువును సెప్టెంబర్ 3వరకు పొడిగించినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సులకు సంబంధించిన విద్యార్హతలు, ఫీజుల వివరాలతో సహా అన్ని వివరాలను యూనివర్సిటీకి చెందిన వెబ్సైట్లో పొందుపర్చినట్లు తెలిపారు.