మల్యాల, ఏప్రిల్ 5: కొండగట్టు అంజన్న హనుమాన్ చాలీసా పారాయణం అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. 20వ రోజైన సోమవారం పూడూర్కు చెందిన అంజన్న భక్తమండలి, మల్యాలకు చెందిన మఠాంజనేయ స్వామి భజన బృందం, జగిత్యాలకు చెందిన వికాస తరంగిణి భజన మండలి సభ్యులతో పాటు కరీంనగర్కు చెందిన గాయకుడు శ్రీనివాస్ కలిసి పారాయణ పఠనం 11 సార్లు కొనసాగించారు. ఆంజనేయస్వామి అర్చకులు ఉత్సవమూర్తులకు ఆలయ స్థా నాచార్యులు జితేంద్రప్రసాద్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు చేశారు. జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి నుంచి 8 మం ది దీక్షాపరులు హనుమాన్చాలీసా పారాయణానికి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఇక్కడ మల్యాల జడ్పీటీసీ కొండపలుకుల రాంమోహన్రావు, సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, ఆలయ పర్యవేక్షకుడు శ్రీనివాసశర్మ, ఆలయ ధర్మకర్తలు ప్రవీణ్, జున్న సురేందర్, ఆసం శివకుమా ర్, కొంక నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు బోయినిపల్లి మధుసూదన్రావు, అనుమాండ్ల రఘు, జాగృతి నాయకులు నీలగిరి రాజేందర్రావు, రాజేందర్, శ్రీనివాస్గౌడ్, వెంకటేశ్వర్రావు, మల్లేశ్ యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
వైఎస్ వివేకా హత్య కేసుపై విజయమ్మ ఏమన్నారంటే!