కవాడిగూడ, ఆగస్టు 24: ఉద్యమంలో పనిచేసిన న్యాయవాదులకు సీఎం కేసీఆర్ న్యాయం చేశారని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సీహెచ్ ఉపేంద్ర, శుభప్రద పాటిల్ను బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం పలువురు హైకోర్టు న్యాయవాదులు బీసీ కమిషన్ సభ్యులను సత్కరించారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమంలో పనిచేసిన వారిని సీఎం కేసీఆర్ గుర్తించి న్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కొంతం గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.