చార్మినార్, మార్చి 6: జూ అంటే ఒక ఆహ్లాద కర వాతావరణం. టీవీలు, సినిమాలలో కనిపిం చే ఎన్నో రకాల పక్షులు, జంతువులను జంతు ప్రదర్శన శాలలో చూసి మనం ఎంతగానో ఆనం దపడతం. పక్షుల కిలకిల రావాలు, జంతువుల అరుపులు విని సంబ్రమాశ్చర్యాలకు గురవుతాం. అయితే, వాటిని చూసి ఆనందించడమే మనవం తవుతుంది. ఆ జంతువులు, పక్షులకు ఏమైనా తినిపించాలనే కోరిక మనలో చాలా మందికి ఉం టుంది. ఇలాంటి కోరికలున్న వారికి జూ అధికా రులు ప్రత్యేకంగా జంతు, పక్షి జాలాన్ని దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
జూలో కిలకిలరావాలతో మనస్సు హత్తుకునే వీక్షణలతో జూ కొత్త అనుభూతులను అందిస్తుందని సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన సిద్ధార్థ్ తెలిపారు. సిదార్థ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం జూను సందర్శించారు. జూలో జంతుజాల రక్షణ కోసం అధికారులు తీసుకుంటున్న పలు జాగ్రత్తలను పరిశీలించిన ఆయన జూ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దత్తతలో భాగస్వాము లు కావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. వెంటనే క్యూరేటర్కు ఆన్లైన్లో రూ.7500లను ట్రాన్సఫర్ చేశారు. అసిస్టెంట్ క్యూరేటర్ నాగమణి మా ట్లాడుతూ, జూ పట్ల సందర్శకులు ఆకర్షితులై పర్యావరణంతో పాటు జంతుజాలాన్ని రక్షించేందుకు భాగస్వాములవుతున్నారని తెలిపారు.