చంపాపేట,సెప్టెంబర్ 03 : ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త అడ్మిషన్లు పెరిగాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆయన శుక్రవారం తనిఖీ నిర్వహించి విద్యా బోధనలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్ కోసమే పాఠశాలలు పునః ప్రారంభించామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల తో పాటు బోధన సిబ్బంది తప్పని సరిగా మాస్కూలు ధరించి, గతం కుంటే మరింత భద్రత పాటించాలని సూచించారు.
ఇదే విధంగా మధ్యాహ్న బోజన సమయంలో పటిష్టమైన జ్రాగతలు తీసుకుని విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత బోధన సిబ్భందిపై ఉందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల రఘుమారెడ్డి, గూడూరు గౌతంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.