కాచిగూడ,ఆగస్టు 13 : ప్రేరణ సంస్థ వీధి బాలలు, బాల కార్మికుల్లో చైతన్యం నింపి, వారికి అవగాహన కల్పించి బడిలో చేర్పించడం గొప్ప విషయమని మూవీ నటుడు కోట శంకర్ అన్నారు. ఆదర్శ కళానిలయం 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బాలల సంక్షేమం, బాల కార్మిక విముక్తి-బాలల హక్కుల పట్ల తల్లిదండ్రులకు అవగాహన కల్పించినందుకు గాను ఆదర్శ కళానిలయం వ్యవస్థాపకుడు చీరాల ప్రకాశ్, ప్రతినిధి వి.మధుమతి ఆధ్వర్యంలో.. ప్రేరణ బాలల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారికి ‘ఆదర్శసేవా పురస్కారాన్ని’ కోట శంకర్, ప్రకాశ్, మధుమతి అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. 23 యేండ్ల కిందట నగరంలో ప్రారంభమై, ప్రభుత్వ ఉప్యాధ్యాయుడిగా లక్ష్మణాచారి పనిచేస్తునే ప్రేరణ బాలల వేదిక పేరుతో నగరంలోని ఉన్న మురికివాడల్లో నివసిస్తున్న బాల కార్మికులు, వీధి బాలలను పాఠశాలల్లో చేర్చేందుకు విశేషంగా కృషి చేయడం శుభ చూచికమన్నారు. కార్యక్రమంలో కామరాజు, ప్రకాశ్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, జగదీష్, పాల్గొన్నారు.