ఖైరతాబాద్, జూలై 18 : వంటింట్లో ఉండే వాము, మిరియాలు, పసుపుతో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సుశీల వర్మ అన్నారు. కాస్మిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపంక్చర్ అండ్ నేచురోపతి స్నాతకోత్సవం ఆదివారం ఖైరతాబాద్లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా 2020-21 విద్యాసంవత్సరాల్లో డిప్లొమా ఇన్ ఆక్యుపంక్చర్, అడ్వాన్స్ ఇన్ డిప్లొమా ఇన్ ఆక్యుపంక్చర్ పూర్తి చేసిన 170మంది విద్యార్థులకు అతిథులు సుశీల వర్మతో పాటు ది ఇండియన్ లాయర్ అండ్ ఎయిల్డ్ సర్వీసెస్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ మోగిలి శ్రీకాంత్ వర్మ, ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ సర్జికల్ డాక్టర్ ఎం.శ్రీనివాసులు, డాక్టర్ గాయత్రి, డాక్టర్ జీఎస్ గుప్తా, నటుడు కిశోర్దాస్తో కలిసి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో సీహెచ్వీజీ భవానీ, చిదంబరం, డాక్టర్ సుధాకర్, పీఎల్కే దుర్గా, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.