టాలీవుడ్ స్టార్ హీరో పవన్కల్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ గురించి సినీ లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గబ్బర్ సింగ్ చిత్రంతో బాక్సాపీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టాడు పవన్కల్యాణ్. ఇపుడు ఈ క్రేజీ కాంబో మరోసారి తెరపై సందడి చేసేందుకు ముస్తాబు కూడా అవుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న పవన్-హరీష్ మూవీపై క్రేజీ అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి..ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడట. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా పూజా కార్యక్రమం జూన్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందట. జాతీయ వాదాన్ని తెలియజేస్తూ..ముఖ్యమైన సందేశాన్ని ఇస్తూ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రానికి ప్లాన్ చేస్తున్నాడు హరీష్ శంకర్.